కాణిపాకంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:34 AM
కాణిపాకంలో ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజ స్వామి గుడిలో శనివారం వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 23: కాణిపాకంలో ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజ స్వామి గుడిలో శనివారం వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ఆనవాయితీలో భాగంగా స్వామికి పట్టు వస్త్రాలను వరసిద్ధుడి ఆలయ చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మూల విరాట్ను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పరదాలతో ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం శ్రీదేవి,భూదేవి సమేతంగా వరదరాజస్వామికి పూజలు చేశారు. అనంతరం ఉత్సవర్లను కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏఈవో విద్యాసాగర్రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 12:34 AM