నేడు టీటీడీ బోర్డు సమావేశం
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:05 AM
టీటీడీ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది.
తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది. చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు జనవరి 1వ తేదీ వరకు జరుగునున్న నేపథ్యంలో వాటిపై చర్చించనున్నారు. రూ.600 కోట్లతో తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుకవైపు ఉన్న 2, 3 సత్రాల స్థానంలో నిర్మించాలని నిర్ణయించిన అచ్యుతం, శ్రీపథం సముదాయాలకు సంబంఽధించిన టెండర్లను ఖరారు చేసే అవకాశముంది. క్షురకుల జీతాలు, ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో సీట్ల పెంపు అంశాలపైనా చర్చించనున్నారు. యథావిధిగా పలు రకాల కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 07:28 AM