వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
ABN, First Publish Date - 2023-11-17T00:42:26+05:30
ఎస్ఆర్పురం మండలం వెంకటాపురం పంచాయతీ పొదలపల్లె, వెంకటాపురం గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు గురువారం టీడీపీలో చేరారు.
శ్రీరంగరాజపురం, నవంబరు 16: ఎస్ఆర్పురం మండలం వెంకటాపురం పంచాయతీ పొదలపల్లె, వెంకటాపురం గ్రామాలకు చెందిన వైసీపీ వర్గీయులు గురువారం టీడీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ థామస్ సమక్షంలో, మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యాన వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంటాపురం పంచాయతీ మాజీ ఎంపీటీసీ తంగవేలు దంపతులు, బీసీవై పార్టీ జిల్లా కోఆర్టినేటర్ జయరాజ్ టీడీపీలో చేరారు. వెంకటాపురం పంచాయతీలో ఇంటింటికీ థామస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాము, జనార్దన్రాజు, శ్రీరామ్, రవి, బాలాజీ నాయుడు, సిద్దయ్యశెట్టి, శ్రీధర్ యాదవ్, గుండయ్య, నాగారాజు, చంద్రబాబురెడ్డి, వెంకటే్షరెడ్డి, భూపతిరెడ్డి, బాబు నాయుడు, చెంగల్రాయల్ యాదవ్, దొడ్డ హేమాద్రి యాదవ్, వంశీ, జనసేన నేత బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-17T00:42:27+05:30 IST