29న జాబ్మేళా
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:59 PM
నగరంలోని కొంగారెడ్డిపల్లె ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 29న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.రవీంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు కల్చరల్, డిసెంబరు 26: నగరంలోని కొంగారెడ్డిపల్లె ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 29న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.రవీంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ర్టీషియన్, డీజల్ మెకానిక్, సివిల్, పెయింటర్, కార్పెంటర్ తదితరత అంశాల్లో ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఎల్ అండ్ టీ కంపెనీవారు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలో ఉచితంగా అన్ని ఖర్చులు భరించి మూడు నెలలు శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం రెగ్యులర్ ఉపాఽధి కల్పించబడునని, ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్ఢు, రెండు ఫొటోలు, ఎస్ఎ్ససీ, ఐటీఐ మార్కుల లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ల జిరాక్స్, ఒరిజనల్తో ఉదయం 10గంటలకు హాజరు కావలెనని ఆయన కోరారు.
Updated Date - Dec 26 , 2023 | 11:59 PM