ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chalasani Srinivas: బీజేపీ విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలి

ABN, First Publish Date - 2023-09-15T11:05:08+05:30

అగ్రిగోల్డ్ బాధితులను జగన్ మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులను జగన్ మోసం చేశారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హామీ అమలు చేయమంటే అరెస్టు చేయిస్తున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దమన కాండ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కనుసన్నల్లో జగన్ పని చేస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గమైన కుట్రలు చేస్తున్న జగన్, మోడీలను ఓడించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే మెడలు వంచుతా అని జగన్ అన్నారని.. 33మంది ఎంపీలు ఉన్నా మోడీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ విష కౌగిలి నుంచి బయటకు రావాలన్నారు. పాచిపోయిన లడ్డూ అన్న పవన్ కళ్యాణ్ వాళ్లతో ఎలా నడుస్తారని నిలదీశారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ల కోసం అందరూ పోరాడాలని చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-15T11:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising