రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమించాలి: కాలవ
ABN, First Publish Date - 2023-12-11T00:05:41+05:30
చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడడానికి అహర్నిశలు శ్రమిం చాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
రాయదుర్గం, డిసెంబరు 10: చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడడానికి అహర్నిశలు శ్రమిం చాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణం లోని ఎంసీఎ కళాశాల వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా మంది టీడీపీ నాయకులతో పాటు సోషల్ మీడియా కార్య కర్తలపై అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఒక మనిషి బతికున్నప్పుడు ఎలా ఉండకూ డదో తెలిపే వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి అని ధ్వజమెత్తారు. ఇసుక అక్ర మ తరలింపు, మద్యం అమ్మకాలతో కోట్లు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో 32 వేల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతు న్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలనే ధోరణీతో పదే పదే అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారన్నారు. వీటిని తిప్పి కొట్టడానికి నిఖార్సైన నిజాలను తెలిపాలని కోరారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ. 4,500 కోట్లు మంజూరు చేశామన్నారు.
Updated Date - 2023-12-11T00:05:42+05:30 IST