ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ : కలెక్టరు

ABN, First Publish Date - 2023-11-10T00:23:29+05:30

కొత్త ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ పక్కాగా నిర్వహిస్తామని కలెక్టరు గౌతమి తెలిపారు.

ఈవీఎంలపై ఆరా తీస్తున్న కలెక్టరు గౌతమి

అనంతపురం టౌన, నవంబరు 9: కొత్త ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ పక్కాగా నిర్వహిస్తామని కలెక్టరు గౌతమి తెలిపారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎంల చెకింగ్‌ పక్రియ గురువారంతో ముగిసింది. పలు విషయాలను కలెక్టరు అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ.. జిల్లాకు కొత్తగా 6,981 బ్యాలెట్‌ యూనిట్లు, 5,450 కంట్రోల్‌ యూనిట్లు, 6,557 వీవీప్యాట్స్‌ ఈవీఎంలు వచ్చాయన్నారు. వాటి పనితీరును 20 రోజులుగా చెక్‌ చేశామని, ఈ కార్యక్రమం గురువారంతో ముగిసిందని తెలిపారు. ఈ చెకింగ్‌లో 76 బ్యాలెట్‌ యూనిట్లు, 193 వీవీప్యాట్స్‌, 44 కంట్రోల్‌ యూనిట్స్‌ రిజెక్ట్‌ అయ్యాయన్నారు. ఈ వివరాలను ఎన్నికల కమిషనకు తెలియజేస్తామన్నారు. మిగిలిన కొత్త ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామని, ఓట్లు సరిగా నమోదవుతున్నాయా లేదా అని పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్రంధి వెంకటేష్‌, ఈవీఎంల చెకింగ్‌ పర్యవేక్షణాధికారి రవీంద్ర, డీపీఓ ప్రభాకరరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ కనకరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising