ప్రాజెక్టుల హామీ ఏమైంది..?
ABN, First Publish Date - 2023-12-10T23:38:14+05:30
‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.
ధర్మవరం రూరల్, డిసెంబరు 10: ‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. కనగానపల్లి మండలం రాం పురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాబు ఘ్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ హయాంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకు హంద్రీనీవా నీరు అందించేందుకు నిధులు కేటాయించామన్నారు. ఈ క్రమంలో పుట్టకనుమ సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు చర్యలు చేపట్టామన్నారు. అయితే వైసీపీ అధికాంలోకి వచ్చాక పుట్టకనుమ రద్దు చేసి ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా.. కనీసం భూ సేకరణ కూడా చేయలేదని విమర్శించారు. నాలుగున్నర ఏళ్లలో రాప్తాడులో జరిగిన ప్రాజెక్టు నిర్మాణలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
Updated Date - 2023-12-10T23:38:17+05:30 IST