ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మూడిళ్లలో చోరీ

ABN, First Publish Date - 2023-11-10T00:16:58+05:30

మండలంలోని కరావులపల్లిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం వద్ద గల హుండీతో పాటు, మూడు ఇళ్లలో చోరీలకు పాల ్పడ్దారు.

హుండీని పరిశీలిస్తున్న పోలీసులు

గోరంట్ల, నవంబరు 9: మండలంలోని కరావులపల్లిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం వద్ద గల హుండీతో పాటు, మూడు ఇళ్లలో చోరీలకు పాల ్పడ్దారు. గ్రామంలో శివాలయం నిర్మాణ పనులు జరుగుతుండడంతో హుండీని సమీపంలోని రామాలయం వద్ద ఆరుబయట ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. దుండగులు ఆ హుండీని ఎత్తుకెళ్లి, సమీపంలోని చెరువులో హుండీని పగలకొట్టి, డబ్బు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు. అలాగే తిమ్మిరెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పెడబల్లికి వెళ్లాడు. దుండగులు ఆ ఇంటి తాళాన్ని బద్దలుకొట్టి, ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా చేసినట్లు బాధితుడు తెలిపారు. విలువైన వస్తువులు లభించినట్లు స్థానికులు అంటున్నారు. గ్రామంలోని కొత్తక్వార్టర్స్‌ లోని మహే్‌షబాబు బెంగుళూరులో ఉంటున్నాడు. కొత్తక్వార్టర్స్‌లోని అతడి ఇంటి తాళం పగలకొట్టి రెండు పట్టుచీరలు, వెండి పళ్లెం, దేవుడి సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే వడ్డె అచ్చమ్మ ఇంటికి తాళం వేసి బంధువులను చూడడానికి పోగూరు వెళ్లగా చోరీ జరిగింది. ఆమె లేకపోవడంతో చోరీ వివరాలు తెలియలేదు. శివాలయం పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ... పదినెలల కిందట హుండీని లెక్కించామని తెలిపారు. తరువాత ప్రజలు వేసిన సొమ్ము చోరీ జరిగిందన్నారు. పూజారి, ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించారు. క్లూస్‌ టీమ్‌ను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇళ్ల యజమానులెవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.

Updated Date - 2023-11-10T00:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising