ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనింగ్‌ నిర్వహణకు అనుమతివ్వొద్దు

ABN, First Publish Date - 2023-11-22T00:03:41+05:30

గ్రామాల పరిధిలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని మండలంలోని పలుగ్రామాల ప్రజలు, రైతులు జిల్లా అధికారులను కోరారు. మంగళవారం మండలంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో మన్నీల, క్రిష్ణంరెడ్డి, చియ్యేడు, కందుకూరు గ్రామాల పరిధిలోని కొండల్లో మైనింగ్‌ నిర్వహణకు పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

అధికారులతో వాదిస్తున్న రైతులు, ప్రజలు

అనంతపురంరూరల్‌, నవంబరు 21: గ్రామాల పరిధిలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని మండలంలోని పలుగ్రామాల ప్రజలు, రైతులు జిల్లా అధికారులను కోరారు. మంగళవారం మండలంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గ్రామ సమీపంలో మన్నీల, క్రిష్ణంరెడ్డి, చియ్యేడు, కందుకూరు గ్రామాల పరిధిలోని కొండల్లో మైనింగ్‌ నిర్వహణకు పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జేసీ కేతనగార్గ్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. ఎనజీఓస్‌కు వాగ్వాదానికి దిగారు. మైనింగ్‌ అనుమతులలో ఏనజీఓస్‌కు సంబంధం ఏమింటంటూ రైతులు మండిపడ్డారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలో ఆరేడు క్రషర్స్‌లు, క్వారీలున్నాయని, మరో మూడింటికి అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇప్పటికే గ్రామస్థులు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కషర్స్‌ వెలువడే దుమ్ము, ధూళి నుంచి పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంటి పరిస్థితుల్లో కొత్త వాటికి అనుమతులు ఇవ్వొదని అధికారులను కోరారు.

Updated Date - 2023-11-22T00:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising