తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Dec 25 , 2023 | 03:14 AM
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
విజయవాడ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాకినాడ టౌన్ వరకు 20 ప్రత్యేక రైళ్లను ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. హైదరాబాద్-తిరుపతి (07489), తిరుపతి-హైదరాబాద్ (07490), హైదరాబాద్-తిరుపతి (07449), తిరుపతి-హైదరాబాద్ (07450), హైదరాబాద్-కాకినాడ టౌన్ (07451), కాకినాడ టౌన్-హైదరాబాద్ (07452) రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, రే ణిగుంట, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.
Updated Date - Dec 25 , 2023 | 07:20 AM