TS News: ప్రేమ పేరుతో యువకుడి మోసం.. వివాహిత ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-10-28T14:21:00+05:30
పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో శ్యామల(38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
కామారెడ్డి: పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో శ్యామల(38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బీబీపేట ఎంపీపీ బాలమణి (టీఆరెస్) కొడుకు గణేష్ మోసం చేయడంతోనే శ్యామల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గణేష్ను శిక్షించాలంటూ కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-10-28T14:23:25+05:30 IST