TS News: జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్లకలక కలకలం
ABN, First Publish Date - 2022-10-29T12:46:08+05:30
భిక్కనూర్ మండలం జంగంపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్ళకలక కలకలం రేగింది.
కామరెడ్డి: జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్ళకలక కలకలం రేగింది. గురుకులంలో 447 మంది విద్యార్థినులకు గాను ఒకేసారి 67 మందికి కళ్లకలక సోకింది. మూడు రోజుల కిందట ఇద్దరు విద్యార్థినులకు సోకిన కళ్లకలక వేగంగా మిగతా వారికి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం విద్యార్థినులకు వైద్యం కొనసాగుతోంది.
Updated Date - 2022-10-29T12:56:26+05:30 IST