ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime: పెళ్లైన నాలుగు నెలలకే దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-07-03T21:36:58+05:30

ఆ యువతికి నాలుగు నెలల కిందటే వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతికి నాలుగు నెలల కిందటే వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టింది.. అప్పట్నుంచే ఆమెకు నరకం మొదలైంది.. అదనపు కట్నం కోస భర్త ఆమెను దారుణంగా హింసించేవాడు.. చివరకు గొడ్డలితో నరికి చంపాడు.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Shocking.. ఇతర మహిళలకు భర్తను అద్దెకిస్తానంటున్న భార్య.. కారణమేంటో తెలిస్తే..


గ్రేటర్ నోయిడా సెక్టార్-36కు చెందిన కాజల్‌ అనే యువతిని రవి అనే యువకుడు ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన నాటి నుంచి కట్నం కోసం భార్యను హింసించడం ప్రారంభించాడు. నిజానికి వివాహ సమయంలోనే కాజల్ తల్లిదండ్రులు రవి అడిగినంత కట్నం ఇచ్చారు. అయినప్పటికీ రవి, ఆమె తల్లిదండ్రులు బైక్, మరింత డబ్బు కావాలని కాజల్‌ను వేధించేవారు. శనివారం రాత్రి కట్నం విషయమై కాజల్, రవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


తీవ్ర ఆగ్రహానికి గురైన రవి ఇంట్లోని గొడ్డలి తీసుకొచ్చి కాజల్ గొంతు కోసి చంపేశాడు. ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. రవితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రవి కుటుంబం పరారీలో ఉంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-07-03T21:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising