ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే..

ABN, First Publish Date - 2022-08-03T22:05:14+05:30

అత్తగారింట్లో చాలా మంది కోడళ్లకు నిత్యం వేధింపులే ఎదురవుతుటాయి. కొన్ని కుటుంబాల్లో అదనపు కట్నం విషయంలో చిత్రహింసలు పెడితే.. మరికొన్ని కుటుంబాల్లో అనుమానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తగారింట్లో చాలా మంది కోడళ్లకు నిత్యం వేధింపులే ఎదురవుతుటాయి. కొన్ని కుటుంబాల్లో అదనపు కట్నం విషయంలో చిత్రహింసలు పెడితే.. మరికొన్ని కుటుంబాల్లో అనుమానం పెంచుకుని వేధించడం జరుగుతుంటుంది. అయినా కొందరు మహిళలు అలాగే భరిస్తుంటారు. కొన్నిసార్లు ఈ గొడవలు పోలీస్ స్టేషన్ల వరకూ చేరుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం భదోహిలోని సురియావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జంగిగంజ్‌కు చెందిన వైశాలి జైస్వాల్‌ అనే యువతికి సూర్యవా నగర్‌కు చెందిన యువకుడితో ఏడాదిన్నర క్రితం వివాహం (marriage) అయింది. వివాహమైన కొన్ని నెలలు దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే తర్వాత వీరి కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. వరకట్నం కోసం భర్త, అత్తమామలు నిత్యం వేధించేవారు. అయినా ఆమె ఎవరికీ చెప్పకుండా అలాగే భరించేది. ఇటీవల వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో వైశాలి జైస్వాల్‌ను చూసేందుకు ఆమె సోదరి సోమవారం వచ్చింది. దీంతో మళ్లీ వారి మధ్య గొడవ మొదలైంది. తన అక్కకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించడంతో అత్తమామలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు


వైశాలి జైస్వాల్‌తో పాటూ ఆమె సోదరిపై కూడా దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి అంతా చూస్తుండగా కొట్టుకుంటూ వెళ్లారు. కోడలు సోదరిని ఊరి బయట వరకూ కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తారు. స్థానికులంతా చూస్తుండిపోయారు తప్ప.. ఎవరూ విడిపించడానికి ప్రయత్నించలేదు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. బుధవారం  వైశాలి జైస్వాల్‌ తన సోదరితో కలిసి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు..  వైశాలి జైస్వాల్‌ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

police raids: ‘మాస్టర్ మైండ్’ ప్లానింగ్ వేశాడు.. చివరకు యువతులతో సహా అంతా బుక్కయ్యారు... ఇంతకీ ఏం జరిగిందంటే..



Updated Date - 2022-08-03T22:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising