police raids: ‘మాస్టర్ మైండ్’ ప్లానింగ్ వేశాడు.. చివరకు యువతులతో సహా అంతా బుక్కయ్యారు... ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-08-03T21:13:57+05:30 IST
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. ఇంకొందరైతే డబ్బుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు.. బాలికలు..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. ఇంకొందరైతే డబ్బుల కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. మరికొందరు.. బాలికలు, యువతులు, మహిళలను టార్గెట్ చేసి అక్రమాలకు పాల్పడుతుంటారు. మధ్యప్రదేశ్లో ఇలాంటి ఓ ముఠా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారం ప్రకారం పోలీసులు (police) దాడులు (Rides) చేసి, యువతులతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ పరిధి నవ్లాఖాలోని ఓ కాంప్లెక్స్లోని ఓ ప్లాట్ను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. ఈ ప్లాట్లో ఆదివారం చాలా మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఈవెంట్స్, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేయడానికి వచ్చారని, అయితే అనుకోని పరిస్థితుల్లో సెక్స్ రాకెట్ ముఠాకు చిక్కుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. విచారణ చేయగా, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సత్నా అనే ప్రాంతానికి చెందిన మాస్టర్ మైండ్ సంతోష్ ఠాకూర్ అనే వ్యక్తి.. యువతులను టార్గెట్ చేసుకుని ఉద్యోగాల పేరుతో ఎర వేశాడు.
వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..
ఈవెంట్స్ (events) , మోడలింగ్ (modeling), ఫ్యాషన్ డిజైనింగ్ (Passion Designing) కోర్సులు తదితరాలకు సంబంధించి అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపాడు. దీంతో ముంబై, లాతూర్, కోల్కతా, భోపాల్ తదితర ప్రాంతాలకు చెందిన యువతులు ఠాకూర్ను సంప్రదించారు. దీంతో వారిని అందరినీ ఇండోర్కు తీసుకొచ్చి, వ్యాభిచార ఊబిలోకి దింపాడు. ప్లాట్ను అద్దెకు తీసుకుని, వారితో బలవంతంగా వ్యభిచారం చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడి చేసి, యువతులందిరనీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మాస్టర్ మైండ్ సంతోష్ ఠాకూర్ కోసం గాలిస్తున్నారు.