ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపు ఆగండి.. అన్నం వండుతానన్న భార్య.. భోజనం ఆలస్యమైందని ఆ భర్త చేసిన దారుణమిదీ..!

ABN, First Publish Date - 2022-05-27T22:09:08+05:30

అతను పని ముగించుకుని ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని భార్యను అడిగాడు.. వేరే పనిలో బిజీగా ఉండడంతో భార్య వంట చేయడం ఆలస్యమైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను పని ముగించుకుని ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని భార్యను అడిగాడు.. వేరే పనిలో బిజీగా ఉండడంతో భార్య వంట చేయడం ఆలస్యమైంది.. కాసేపు ఆగితే వంట చేసి పెడతానని భార్య చెప్పింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, భార్యతో వాగ్వాదానికి దిగాడు.. ఒక దుడ్డు కర్రతో ఆమె తల పగలగొట్టాడు.. అనంతరం ఆమెను బావిలో పడేసి బయటకు వెళ్లిపోయాడు.. పోలీసులు వచ్చి చూసే సరికి ఆ మహిళ చనిపోయింది. 


ఇది కూడా చదవండి..

ఓ యువతి కిడ్నాప్ కేసు.. ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ఓ హోటల్‌లో తనిఖీ చేస్తే గదిలో కనిపించిన సీన్ చూసి నివ్వెరపోయిన పోలీసులు..!


మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన దినేష్ మాలి అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన పని ముగించుకుని ఇంటికి వెళ్లాడు. భార్య యశోదను భోజనం పెట్టమని అడిగాడు. అయితే బట్టలు ఉతకడం ఆలస్యం కావడంతో అప్పటికి యశోద వంట చేయలేదు. దీంతో దినేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దుడ్డు కర్ర తీసుకుని భార్య తల పగలగొట్టాడు. అడ్డు వచ్చిన కూతురు నికితను కూడా కొట్టాడు. అనంతరం భార్యను ఎత్తుకుని తీసుకెళ్లి బావిలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. 


నికిత వెంటనే బంధువులకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ వచ్చి చూసేటప్పటికీ బావిలో యశోద చనిపోయి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. నిందితుడు దినేష్‌ను అరెస్ట్ చేశారు.  

Updated Date - 2022-05-27T22:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising