ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదిలోకి దూకేసిన ప్రేయసికి భారీ షాక్.. చచ్చేందుకు వచ్చిన ప్రియుడు ఎస్కేప్.. ఈదుకుంటూ బయటికొచ్చి ఆమె ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-06-16T01:10:57+05:30

ఆమెకు అప్పటికే వివాహమైంది. కానీ ఓ యువకుడిపై ప్రేమ పెంచుకుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కలిసి బతికే అవకాశం లేకపోతే.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెకు అప్పటికే వివాహమైంది. కానీ ఓ యువకుడిపై ప్రేమ పెంచుకుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కలిసి బతికే అవకాశం లేకపోతే.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఓ నది వద్దకు వెళ్లారు. ముందుగా ప్రియురాలు నీటిలోకి దూకింది. అయితే ప్రియుడు మాత్రం దూకకుండా.. మనసు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె షాక్ అయి.. ఈదుకుంటూ బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో నివాసం ఉంటున్న 32ఏళ్ల వివాహిత 30ఏళ్ల యువకుడిని ప్రేమించింది. భర్తకు తెలీకుండా ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు. తర్వాత వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ప్రియురాలికి తెలిసి.. అతడి వద్దకు వెళ్లి నిలదీసింది. వెంటనే భార్యకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. కలిసి బతికే అవకాశం లేకుంటే.. కలిసి చనిపోదామని ఇధ్దరూ నిర్ణయించుకున్నారు. నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుకోవాలని మాట్లాడుకున్నారు.

11ఏళ్ల తర్వాత స్నేహితురాలిని గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. స్వీట్లు తిన్న మహిళ.. కాసేపటికి పాఠశాల భవనంలో అపస్మారక స్థితిలో..


అనుకున్నట్లుగానే స్థానికంగా ఉన్న ఓ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ముందుగా ప్రియురాలు నీటిలోకి దూకింది. అయితే వెనువెంటనే నీటిలోకి దూకాల్సిన ప్రియుడు.. మనసు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నీటిలోకి దూకిన తర్వాత ప్రియుడు దూకలేదనే విషయం తెలుసుకున్న మహిళ అవాక్కయింది. ఈదుకుంటూ బయటికి వచ్చి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమె ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

పశువుకు అనారోగ్యంగా ఉండడంతో చూడటానికి వెళ్లిన వైద్యుడు.. మరుక్షణం పెళ్లి మంటపంలో ప్రత్యక్షం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-06-16T01:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising