11ఏళ్ల తర్వాత స్నేహితురాలిని గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. స్వీట్లు తిన్న మహిళ.. కాసేపటికి పాఠశాల భవనంలో అపస్మారక స్థితిలో..

ABN , First Publish Date - 2022-06-16T00:33:53+05:30 IST

వారిద్దరూ 11ఏళ్ల క్రితం కలిసి చదువుకొనేవారు. తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 11ఏళ్ల అనంతరం ఇటీవల ఇద్దరూ తారసపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత కలవడంతో కుశల..

11ఏళ్ల తర్వాత స్నేహితురాలిని గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. స్వీట్లు తిన్న మహిళ.. కాసేపటికి పాఠశాల భవనంలో అపస్మారక స్థితిలో..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ 11ఏళ్ల క్రితం కలిసి చదువుకొనేవారు. తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. 11ఏళ్ల అనంతరం ఇటీవల ఇద్దరూ తారసపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత కలవడంతో కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తర్వాత స్నేహితురాలిని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లాడు. స్నేహితుడు ఇచ్చిన స్వీట్లు తిన్న మహిళ.. కొద్ది సేపటికి పాఠశాలలోని పాడుబడ్డ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్పృహలోకి వచ్చాక.. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయింది. వివరాల్లోకి వెళితే.. 


హర్యానా రాష్ట్రం అంబలా నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళకు.. 11ఏళ్ల క్రితం అమర్జీత్ అనే వ్యక్తితో కంప్యూటర్ క్లాసులో పరిచయం ఏర్పడింది. అయితే తర్వాత వివిధ కారణాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇలావుండగా.. 11ఏళ్ల తర్వాత ఇటీవల ఓ రోజు మార్కెట్‌లో ఇద్దరూ తారసపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత ఎదురుపడడంతో కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తర్వాత తన చెల్లెలి ఇంటికి రమ్మని పిలవడంతో అతడితో పాటూ వెళ్లింది. అక్కడికి వెళ్లాక స్నేహితురాలికి స్వీట్లు పెట్టాడు. అవి తిన్న కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తర్వాత ఆమెను స్థానికంగా ఉన్న పాఠశాల పాత భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన ఆమె.. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయింది.

పశువుకు అనారోగ్యంగా ఉండడంతో చూడటానికి వెళ్లిన వైద్యుడు.. మరుక్షణం పెళ్లి మంటపంలో ప్రత్యక్షం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసి, ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. ఆమె ఇద్దరు పిల్లలను కూడా చంపుతానని బెదిరించడంతో భయపడిపోయి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. తర్వాత ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల ఓ రోజు ఆమె వద్ద ఫోన్ మరచిపోయి వెళ్లాడు. పోన్‌ను పరిశీలించిన మహిళ.. అందులోని వీడియోలను డిలీట్ చేసి.. జరిగిన విషయాన్ని సోదరుడికి తెలియజేసింది. వారి ఫిర్యాదు మేరకు నిందితుడు, అతడి సోదరుడు ఓంపాల్, బావమరిది రాజు, స్కూల్ ప్రిన్సిపాల్ కర్తార్ సింగ్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పరిచయం.. మొదట ఫోన్‌లో మాత్రమే మాట్లాడే యువకుడు.. ఓరోజు ప్రియురాలు ఒంటరిగా ఉండగా ఇంట్లోకి వెళ్లి..

Updated Date - 2022-06-16T00:33:53+05:30 IST