ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime: భార్యకు AIDS అని తెలిసి దూరం.. మరదలితో అఫైర్.. చివరకు ఎంత పని చేశాడంటే..

ABN, First Publish Date - 2022-07-08T23:55:40+05:30

ఆ జంటకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. రెండేళ్లకు వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఏడాది క్రితం భార్యకు ఎయిడ్స్ సోకినట్లు భర్తకు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ జంటకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. రెండేళ్లకు వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఏడాది క్రితం భార్యకు ఎయిడ్స్  సోకినట్లు భర్తకు తెలిసింది. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. తన భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, కొడుకును వదిలేసి మరదలితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరదలిని పెళ్లి చేసుకోవాలనుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. 


ఇది కూడా చదవండి..

Crime: మరిదితో అఫైర్ పెట్టుకున్న వదిన.. చివరకు అతని చేతిలోనే హతం.. కారణం ఏంటంటే..


Gujaratలోని రాజ్‌కోట్ ప్రాంతానికి చెందిన రాజేష్, రంజన్ దంపతులకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత వీరికి ఒక బాబు పుట్టాడు. ఏడాది క్రితం రంజన్‌కు Aids సోకినట్లు రాజేష్‌కు తెలిసింది. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఆ క్రమంలో భార్య సోదరితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత భార్య, కొడుకును వదిలేసి మరదలిని తీసుకుని వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రంజన్.. పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్యను అడ్డు తొలగించుకుని మరదలిని పెళ్లి చేసుకొవాలని రాజేష్ భావించాడు. 


పుట్టింటిలో ఉన్న భార్యకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. నెల రోజుల తర్వాత సెల్‌ఫోన్ ఛార్జర్‌తో ఆమెకు ఊపిరి ఆడుకుండా చేసి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని గ్రామ శివారులో పాతిపెట్టాడు. తన భార్య డబ్బులు, నగలు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిందని కట్టుకథ అల్లాడు. అయితే రంజన్ తల్లిదండ్రులు అతని మాటలు నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో రాజేష్ నిజం అంగీకరించాడు. తన భార్యను చంపేసి మృతదేహాన్ని పాతిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు రాజేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-08T23:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising