Crime: మరిదితో అఫైర్ పెట్టుకున్న వదిన.. చివరకు అతని చేతిలోనే హతం.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-06T23:31:34+05:30 IST

వివాహేతర సంబంధాలు ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు తమ భాగస్వాములను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు.

Crime: మరిదితో అఫైర్ పెట్టుకున్న వదిన.. చివరకు అతని చేతిలోనే హతం.. కారణం ఏంటంటే..

వివాహేతర సంబంధాలు ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు తమ భాగస్వాములను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. మరికొందరు స్వయంగా తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Vegan Burger: మానవ మాంసాన్ని రుచి చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బర్గర్ తినాల్సిందే..


భోపాల్‌లోని గాంధీనగర్‌కు చెందిన అన్సార్ ఖాన్, షబానా బేగం భార్యభర్తలు. అన్సార్ ఖాన్ ఉద్యోగం నిమిత్తం గుజరాత్‌లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భోపాల్ వెళ్తుండేవాడు. షబానా ఒంటరిగా తన అత్తగారింట్లో ఉండేది. భర్త దూరంగా ఉండడంతో ఆమె భర్త సోదరుడు ఆసిఫ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ భార్యభర్తల మాదిరిగానే కలిసి ఉండేవారు. వేరే ఊర్లకు వెళ్లినపుడు తాము భార్యాభర్తలమనే చెప్పుకునేవారు. అయితే తనతోనే కాకుండా మరో వ్యక్తితో కూడా షబానా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆసిఫ్ అనుమానించడం ప్రారంభించాడు. 


ఆ విషయమై వదినతో ఆసిఫ్ తరచుగా గొడవపడేవాడు. ఆ గొడవ తీవ్రంగా మారడంతో షబానా గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. హత్య చేసిన తర్వాత ఆమెను ఒక వస్త్రంలో చుట్టి, ఊరిచివరలో ఉన్న మురికి నీటిలో పడేశాడు. అయితే స్థానికులు ఆసిఫ్‌ను చూసి నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణంలో ఆసిఫ్ తన తప్పును అంగీకరించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-07-06T23:31:34+05:30 IST