ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నట్టింట్లో ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు.. పక్కనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తండ్రి.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-21T22:21:21+05:30

అతను పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.. అతనికి ఒక భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.. మద్యానికి బానిస అయిన అతను రోజూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.. అతనికి ఒక భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.. మద్యానికి బానిస అయిన అతను రోజు తాగి ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను హింసించేవాడు.. శుక్రవారం సాయంత్రం అతను ఇంట్లోనే మద్యం సేవిస్తుండగా ఇద్దరు కూతుళ్లు స్కూలు నుంచి వచ్చారు.. ఇంట్లోనే మద్యం సేవిస్తున్న తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో అతను తన ఇద్దరు కూతుళ్ల తలలను పగలగొట్టేశాడు.. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో కూతురు వచ్చి చూసే సరికి నట్టింట్లో ఇద్దరు కూతుళ్ల మృతదేహాల పక్కన తండ్రి కూర్చుని ఉన్నాడు.

ఇది కూడా చదవండి..

పిల్లలతో సహా భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు.. సరిగ్గా 9వ రోజు ఓ లాడ్జిలో కనిపించిన దారుణమిదీ..!


తమిళనాడులోని కాంచీపురంకు చెందిన గోవింద రాజ్ అనే వ్యక్తికి దీన (18), నందిని (16), దీప (10) అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గోవీంద రాజ్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే మద్యానికి బానిస అయిన గోవింద తరచుగా విధులకు గైర్హాజరయ్యేవాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం సేవించడం ప్రారంభించాడు. ఆ సమయంలో నందిని, దీప స్కూలు నుంచి తిరిగి వచ్చారు. ఇంట్లోనే మద్యం సేవిస్తున్న తండ్రిని నిలదీశారు. 


కూతుళ్లు నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గోవింద వారిని ఓ చెక్కతో బలంగా కొట్టాడు. ఇద్దరి తలలపై తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రెండు గంటల తర్వాత దీన బయటి నుంచి వచ్చే సరికి ఇంటి తలుపులు లోపలి నుంచి వేసి ఉన్నాయి. ఆమె ఎంత కొట్టినా తలుపులు తీయలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వారు బలవంతంగా తలుపులు తెరవగా లోపల నట్టింట్లో ఇద్దరు కూతుళ్ల మృతదేహాల పక్కన గోవింద కూర్చుని ఉన్నాడు. బయటి వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2022-05-21T22:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising