పిల్లలతో సహా భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు.. సరిగ్గా 9వ రోజు ఓ లాడ్జిలో కనిపించిన దారుణమిదీ..!

ABN , First Publish Date - 2022-05-20T23:05:58+05:30 IST

తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు..

పిల్లలతో సహా భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు.. సరిగ్గా 9వ రోజు ఓ లాడ్జిలో కనిపించిన దారుణమిదీ..!

తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఈ నెల 11న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. అతను ఫిర్యాదు చేసిన తొమ్మిది రోజుల తర్వాత ఒక లాడ్జిలో అతని భార్య, పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి.. ఆ ముగ్గురితో పాటు మరో యువకుడి మృతదేహం కూడా దొరికింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి.. 

గుడిలో ప్రసాదం తింటూ.. రోడ్డు పక్కన పడుకుంటున్న నలుగురు బాలికలు.. మీరెవరని స్థానికులు అడిగితే..!



మహారాష్ట్రలోని శికార్పూర్‌కు చెందిన ఆశారామ్ అనే వ్యక్తి ఈ నెల 11న తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో ఉన్న లాడ్జ్‌లోని ఓ గదిలో ఈ నెల 17న ఆశారామ్ భార్య ప్రియాంక (25), కూతురు భక్తి (5), మౌళి (3) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ముగ్గురితో పాటు శికార్పూర్‌కే చెందిన చింతామన్ (29) అనే వ్యక్తి మృతదేహం కూడా దొరికింది. ముందుగా పిల్లలిద్దరికీ విషం ఇచ్చి చంపి ఆ తర్వాత చింతామన్, ప్రియాంక ఆత్మహత్యలు చేసుకున్నారు. 


ఈ నెల 11న వారు గది అద్దెకు తీసుకున్నట్టు లాడ్జి సిబ్బంది చెప్పారు. అప్పట్నుంచి వారు బయటకు రాకపోవడంతో 17వ తేదీన తలుపు తెరిచి చూడడంతో మృతదేహాలు కనిపించాయి. పిల్లలిద్దరి మృతదేహాలు మంచం మీద పడి ఉండగా.. ప్రియాంక, చింతామన్ ఉరి వేసుకున్నారు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చింతామన్, ప్రియాంక మధ్య వివాహేతర సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్తామని చెప్పారు. 



Updated Date - 2022-05-20T23:05:58+05:30 IST