ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్‌లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ఎన్నారైలు

ABN, First Publish Date - 2022-12-14T15:05:07+05:30

ఇటీవల టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్‌గా మారిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇటీవల టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్‌గా మారిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నారై బీఆర్ఎస్(BRS) యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మొట్టమొదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్‌లో ఎగరవేసి, కేసీఆర్(KCR) నాయకత్వంలో రాష్ట సాధన కోసం ముందుకు సాగాం. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను మొట్టమొదటగా లండన్‌(London)లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యం అవుతుందని ఎన్నారై(NRI)లు విశ్వసిస్తున్నారు. ఎన్నారైలు కేసీఆర్ వెంటే ఉంటారు.’ అని అశోక్ గౌడ్ అన్నారు.

‘యూకేలో నివసిస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు కూడా బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇండియా నుంచి బీఆర్ఎస్ నాయకులను యూకేకు ఆహ్వానించి, త్వరలోనే పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తాం’ అని అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ చందూ గౌడ్ సీక ఈ సందర్భంగా వెల్లడించారు. కేసీఆర్ ప్రతి పిలుపుకీ స్పందించి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని ఉపాధ్యక్షుడు నవీర్ రెడ్డి అన్నారు. నాడు ఉద్యమ సందర్భంగా టీఆర్ఎస్‌లో, నేడు బీఆర్ఎస్‌లో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించినందుకుగాను కార్యదర్శి సత్య చిలుముల.. కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో "దేశ్ కి నేత కేసీఆర్". "అబ్ కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంఛార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృథ్వి రావుల, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T15:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising