ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుకుంటానంటూ రోడ్డుపైనే ఉండిపోయిన 8 ఏళ్ల బాలిక.. ఇంట్లోకి వెళ్లిన తల్లి మళ్లీ తిరిగొచ్చి చూస్తే..

ABN, First Publish Date - 2022-12-09T15:06:22+05:30

ఆ బాలిక వయసు 8 సంవత్సరాలు.. తన చెల్లెలితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది.. అక్కడే ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ ఉన్నారు.. కొద్ది సేపటి తర్వాత అమ్మ, అమ్మమ్మ వంట చేయడం కోసమని లోపలికి వెళ్లారు.. వారు అరగంటలో బయటకు తిరిగి వచ్చే సరికి ఆ బాలిక కనిపించలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక వయసు 8 సంవత్సరాలు.. తన చెల్లెలితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది.. అక్కడే ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ ఉన్నారు.. కొద్ది సేపటి తర్వాత అమ్మ, అమ్మమ్మ వంట చేయడం కోసమని లోపలికి వెళ్లారు.. వారు అరగంటలో బయటకు తిరిగి వచ్చే సరికి ఆ బాలిక కనిపించలేదు.. చుట్టు పక్కల అంతా వెతికినా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు.. తెల్ల కారులో వచ్చిన వ్యక్తులు అక్కను తీసుకెళ్లారని చిన్న కూతురు చెబితే తల్లి షాకైంది.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.. మూడ్రోజులైనా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన ఇంటి ముందు ఆడుకుంటూ దుర్గ అనే 8 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం అదృశ్యమైంది. అదృశ్యం కావడానికి ముందు వరకు ఆమె తన కుటుంబ సభ్యుల ఎదుటే ఉండి ఆడుకుంటోంది. వారు లోపలికి వెళ్లి బయటకు వచ్చి చూసే సరికి దుర్గ కనిపించలేదు. మూడు రోజులు గడిచినా బాలిక జాడ లేదు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన బాలిక కోసం గాలిస్తున్నారు. తెలుపు రంగు కారులో వచ్చిన వ్యక్తి తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు బాలిక తల్లి అల్పన తెలిపారు. రెండు నెలల క్రితం బిలాస్‌పూర్‌లో కూడా అదే వయసు బాలికలు ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇదంతా ఏదో ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-12-09T15:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising