దారుణం.. మూగ, చెవుడు అయిన కూతురు అదృశ్యం.. వెతుక్కుంటూ వెళ్తే రోడ్డు పక్కన రక్తపు మడుగులో..
ABN, First Publish Date - 2022-11-25T18:30:31+05:30
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు మృగాళ్లను ఆపలేకపోతున్నాయి. అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఓ మూగ-చెవిటి యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత..
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు మృగాళ్లను ఆపలేకపోతున్నాయి. అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఓ మూగ-చెవిటి యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న యువతిని రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు.. తండ్రి ఆమెను గుర్తించి హాస్పిటల్లో చేర్చాడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. యువతి మాట్లాడలేదు కాబట్టి నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది..
బార్మర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి (20) గురువారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమీపంలో మేకలు మేపేందుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడకు తెల్లటి బొలెరో వాహనంలో నలుగురు యువకులు వచ్చారు. వారు ఆ బాలికను అపహరించి సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం స్పృహలో లేని ఆమెను గ్రామానికి సమీపంలోని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఆ నలుగురూ ఆమెను తీవ్రంగా గాయపరిచారు. సాయంత్రం నుంచి కూతురు కనిపించకపోవడంతో తండ్రి ఆమె కోసం అన్వేషణ ప్రారంభించాడు.
రాత్రి సమయంలో ఓ రోడ్డు పక్కన పడి ఉన్న కూతురిని వెంటనే హాస్పిటల్కు తరలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్కు చేరుకున్న పోలీసులు ఆ యువతి స్టేట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ యువతి మాట్లాడలేదు కాబట్టి.. సైగల ద్వారా ఆమె చెప్పిన దాన్ని నోట్ చేసుకున్నారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గుర్తు తెలియని దుండగుల కోసం గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, సాంకేతిక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Updated Date - 2022-11-25T18:30:33+05:30 IST