Road Accident: నెల్లూరులో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2022-11-29T09:20:47+05:30
జిల్లాలోని దగదర్తి మండలం కౌరుగుంట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
నెల్లూరు: జిల్లాలోని దగదర్తి మండలం కౌరుగుంట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీని ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.... ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. చెలికిసంఘంకి చెందిన 18 మంది ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరదయ్య, నారాయణమ్మలు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను కావలి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-11-29T09:21:01+05:30 IST