High Court: పాదయాత్రపై దాఖలైన మధ్యంతర, రిట్ అప్పీల్ను కొట్టివేసిన హైకోర్టు
ABN, First Publish Date - 2022-11-16T14:07:44+05:30
రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది.
అమరావతి: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ను బుధవారం విచారించిన హైకోర్టు కొట్టివేసింది. పాదయాత్రపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పులో... పార్టీలు కాని వారు వేస్తే అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ పిటీషన్ వేయడం న్యాయబద్దం కాదని పేర్కొంది. రైతాంగ సమాఖ్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్లు కోరారు. మధ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో... రిట్ అప్పీల్కు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది.
Updated Date - 2022-11-16T14:07:48+05:30 IST