ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaluva srinivasulu: ర్యాలీలు చేస్తే కర్నూలులో న్యాయ రాజధాని వస్తుందా?

ABN, First Publish Date - 2022-11-02T12:10:45+05:30

న్యాయ రాజధాని ముసుగులో సీమ ప్రజలకు అసలు రాజధానిని దూరం చేసే కుట్ర జగన్ మొదలుపెట్టారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: న్యాయ రాజధాని ముసుగులో సీమ ప్రజలకు అసలు రాజధానిని దూరం చేసే కుట్ర జగన్ (YS jagan mohan reddy) మొదలుపెట్టారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు (Kaluva srinivasulu) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) సీమ ప్రాంతంలో ర్యాలీలు చేస్తే కర్నూల్‌లో న్యాయ రాజధాని వస్తుందా అని ప్రశ్నించారు. ఢిల్లీని వదిలి వైసీపీ ఎమ్మెల్యేలు గల్లీలో ర్యాలీలు చేస్తే ఏమి ఉపయోగమన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా భయంకరమైన రాజకీయ క్రీడ జగన్ (AP CM) మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో బస్ స్టాండ్ కూడా కట్టలేని జగన్ రాయలసీమను న్యాయ రాజధానిగా మారుస్తాడా అంటూ టీడీపీ నేత యెద్దేవా చేశారు. 3

జగన్ (YCP Chief) చర్యలపై సీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయలేక జగన్ కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని అన్నారు. విశాఖ, కర్నూల్‌లో జరిగేది వైసీపీ సృష్టించిన కృత్రిమ ఉద్యమం మాత్రమే అని వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయ్యాక రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏ సీఎం సీమకు చేయని ద్రోహం జగన్ సీఎం అయ్యాక చేశారని కాలువ శ్రీనివాసులు (TDP Leader) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-11-02T12:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising