ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni uma: పోలవరంను బ్యారేజిగా మార్చేహక్కు ఎవరిచ్చారు జగన్ రెడ్డి?

ABN, First Publish Date - 2022-11-18T10:31:51+05:30

పోలవరం ప్రాజెక్ట్‌ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ (Polavaram project)ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni uma) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతలుగా మార్చడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని అన్నారు. కమిషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాతో జరుగుతున్న పనులు ఆపారని... .ఏడాదిగా ఒక్కశాతం పనులు చేయలేదని మండిపడ్డారు. 31మంది ఎంపీలుండి ఒక్కసారైనా నిధులు అడిగారా? అని ప్రశ్నించారు. కేసుల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టిన సీఎం జగన్ (CM Jagan mohan reddy)పోలవరం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఏసీలో 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రూ.55,548 కోట్లకు ఆమోదం తెస్తే 42 నెలలుగా ఏం చేశారని నిలదీశారు. 194 టీఎంసీల నీటిని ఎప్పుడు నిల్వ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులను మోసం చేసి గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టును బ్యారేజిగా మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి?’’ అని దేవినేని ఉమా (Former minister) విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-11-18T10:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising