ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కరణం ధర్మశ్రీ భేటీ

ABN, First Publish Date - 2022-11-02T12:17:23+05:30

కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బుధవారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari)ని ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ (Karanam Dharma sri) బుధవారం భేటీ అయ్యారు. సబ్బవరం - తుని రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలంటూ ఈ సందర్భంగా కేంద్రమంత్రి (Union minister)కి కరణం వినతి చేశారు. అనంతరం ఏపీ ప్రభుత్వ విప్ (AP Government whip)మీడియాతో మాట్లాడుతూ... సబ్బవరం - తుని రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని అన్నారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2200 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ రహదారి పనులు వేగంగా చేయాలని గడ్కరీని కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ రహదారితో ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. డీపీఆర్ కూడా ఇప్పటికే పూర్తైందన్నారు. ఈ అంశంపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని కరణం ధర్మశ్రీ తెలిపారు.

Updated Date - 2022-11-02T12:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising