ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మీడియాను తిట్టండి.. నా మీడియాను పొగడండి..!

ABN, First Publish Date - 2022-04-28T14:12:20+05:30

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మళ్లీ గెలవడమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. ‘మంత్రులంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల తర్వాతే మంత్రుల స్థానం! మంత్రులకంటే వీళ్లే ఎక్కువ. ఈ విషయాన్ని మంత్రులు మనసులోకి ఎక్కించుకోవాలి. పార్టీయే సుప్రీం. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.


కాగా.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ఎప్పట్లాగానే తనకు గిట్టని మీడియాపై జగన్‌ అక్కసు వెళ్లగక్కారు. ‘‘మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కాదు... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లతో యుద్ధం చేస్తోంది. ప్రభుత్వంపైనా.. పార్టీపైనా వీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి’’ అని సూచించారు. తమ సొంత మీడియా ద్వారా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతామన్నారు. ప్రభుత్వాన్ని, పాలనను విమర్శించే మీడియానూ తిట్టాలని, తన సొంత మీడియాను పొగడాలని ఆదేశించారు.


                       పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

Updated Date - 2022-04-28T14:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising