ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మరో వివాదంలో రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు

ABN, First Publish Date - 2022-12-13T10:00:43+05:30

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు (Raptadu MLA Topudurthi Prakash Reddy's brother Topudurthi Chandrasekhar Reddy in another controversy). ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసులో నిందితులు డివి నాయుడు, గౌరీ శంకర్‌కు మద్దతుగా చంద్రశేఖర్ రెడ్డి హల్ చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకొని ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే పంచాయితీ నిర్వహించారు. 2019 సంవత్సరంలో రుద్రంపేట పంచాయతీ పరిధిలో 1.27 ఎకరాల భూమిని రియల్ వ్యాపారి డివి నాయుడు, బ్యాంకు మాజీ ఉద్యోగి గౌరీ శంకర్‌కు కూడేరు మండలం కడదరకుంటకు చెందిన రమేష్ విక్రయించారు. అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. డివి నాయుడు, గౌరీ శంకర్ అనే వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా బెదిరించడంతోనే రమేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య నీరజ కూడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా రియల్ వ్యాపారి డివి నాయుడు, గౌరీ శంకర్‌ను ఉరవకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సన్నితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారంతో చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. కాగా... చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-12-13T10:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising