8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్..
ABN, Publish Date - Feb 27 , 2024 | 11:25 AM
అమరావతి: మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీకి చెందిన నలుగురు, వైసీసీకి ఎమ్మెల్యేలు నలుగురు.. మొత్తం 8 మందిపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.
అమరావతి: మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీకి చెందిన నలుగురు, వైసీసీకి ఎమ్మెల్యేలు నలుగురు.. మొత్తం 8 మందిపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. టీడీపీ ఫిర్యాదు మేరకు వాసుపల్లి గణేష్, గిరి, కరణం బలరాం, వంశీ.. వైసీపీ ఫిర్యాదు మేరకు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేలుగా అనర్హులని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 28 , 2024 | 07:35 PM