ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతికి ఎస్సై ప్రేమ వల
ABN, Publish Date - Feb 19 , 2024 | 02:56 AM
స్టేషనుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ఎస్సైని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం
ఆపై మరో యువతితో నిశ్చితార్ధం
బాధితురాలి ఫిర్యాదుతుతో నిందితుడిని అరెస్ట్ చేసిన సైదాబాద్ పోలీసులు
సైదాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): స్టేషనుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ఎస్సైని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్ల్లాకు చెందిన ఓ గిరిజన యువతి నగరంలో జూనియర్ ఆర్టి్స్టగా పనిచేస్తూ సైదాబాద్ పీఎస్ పరిధిలోని తన అత్త వాళ్ల వద్ద ఉంటోంది. గతేడాది జనవరిలో అత్త, మామల మఽధ్య జరిగిన గొడవ కారణంగా ఫిర్యాదు చేసేందుకు సైదాబద్ పీఎ్సకు వెళ్లింది. ఆ సమయంలో ట్రైనీ ఎస్సైగా ఉన్న నిజామాబాద్కు చెందిన పబ్బా అరుణ్(29).. క్రమంగా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబరు తీసుకొని తరచూ ఫోన్లో, వాట్సా్పలో టచ్లో ఉండేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆరునెలల క్రితం సదరు యువతి అరుణ్ ఫోన్లో అతడికి మరో అమ్మాయితో నిశ్చితార్థం అయిన ఫొటోలను చూసి నిలదీసింది. ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని అరుణ్ నమ్మబలికాడు. ఆ తర్వాత నెలల గడుస్తున్నా అరుణ్ పెళ్లి ప్రస్తావన వాయిదా వేస్తుండడంతో యువతి అరుణ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి సోదరుడికి ఫోన్ చేసి తమ సంబంధం గురించి చెప్పింది. ఈ క్రమంలో అరుణ్ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో బాధితురాలు సైదాబద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ వీఆర్లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Feb 19 , 2024 | 02:59 AM