అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు సీజ్
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:16 AM
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను కులకచర్ల పోలీసులు సీజ్ చేశారు.
కులకచర్ల, మార్చి 7: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను కులకచర్ల పోలీసులు సీజ్ చేశారు. కులకచర్ల మండలంలోని అనంత సాగర్ గ్రామపరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు నిల్వ ఉంచారు. ఈ విషయంపై గ్రామస్తులు తహసీల్దార్ మురళీధర్కు సమాచారం అందించారు. గురువారం తహసీల్దార్ ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్వే్షరెడ్డి తెలిపారు.
ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్
తాండూరు: అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సీజ్చేసినట్లు ఎస్ఐ గిరి తెలిపారు. రేగోండి నుంచి ఇసుక పర్మిట్ల సమయం ముగిసిన తర్వాత అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా మంబాపూర్ వద్ద వాటిని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. వాటిని పోలీ్సస్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - Mar 08 , 2024 | 12:16 AM