రెండు ఆవులు, దూడ అపహరణ
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:00 AM
పొలం వద్ద దొడ్డిలో కట్టేసిన రెండు ఆవులు, ఓ దూడను బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యాచారం, ఫిబ్రవరి 29 : పొలం వద్ద దొడ్డిలో కట్టేసిన రెండు ఆవులు, ఓ దూడను బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం పోలీ్సస్టేషన్ పరిధిలోని గున్గల్ గ్రామానికి చెందిన యార కిష్టయ్య బుధవారం సాయంత్రం తన పొలం వద్ద దొడ్డిలో రెండు ఆవులు, ఓ దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం పాలు పితకడానికి వెళ్లగా.. ఆవులు, దూడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వాటి విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుందని రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
Updated Date - Mar 01 , 2024 | 12:00 AM