ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:14 AM
విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రూరల్ ఎస్ఐ బాలునాయక్ అన్నారు.
సూర్యాపేట రూరల్, మార్చి 2 : విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రూరల్ ఎస్ఐ బాలునాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సమస్యలుంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని, మనోధైర్యంతో ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ కళాబృందంతో మహిళల భద్రత, డయల్-100, సోషల్ మీడియా తదితర సైబర్నేరాలపై ఆటపాటలతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీటీం ఎస్ఐ ప్రవీణ్కుమార్, షీటీం సిబ్బంది ఎల్లారెడ్డి, సాయిజ్యోతి, యల్లయ్య, గోపీ,చారి, గురులింగం, క్రిష్ణ, ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:14 AM