బీఆర్ఎస్ శకం ముగిసింది: కె.లక్ష్మణ్
ABN, Publish Date - Feb 05 , 2024 | 04:30 AM
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పదికి తక్కువ కాకుండా సీట్లు, 35 శాతం ఓట్లు సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పదికి తక్కువ కాకుండా సీట్లు, 35 శాతం ఓట్లు సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎ్సను బతికించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, ఆ రెండు పార్టీలు తోడుదొంగలేనని అన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూలును సాకుగా చూపించి ఆరు గ్యారంటీల అమలును వాయిదా వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఇండియా కూటమికి ఎజెండా లేదని, నాయకుడు ఎవరో తేల్చుకోలేక విపక్షాలు సతమతమవుతున్నాయని, దేశంలోని ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటై పోటీచేసినా బీజేపీని ఓడించలేవని తెలిపారు.
Updated Date - Feb 05 , 2024 | 04:31 AM