రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం
ABN, Publish Date - Feb 12 , 2024 | 12:17 AM
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాం జనేయ చౌదరి (తపనా చౌదరి) అన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి
వేలేరుపాడు, ఫిబ్రవరి 11: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాం జనేయ చౌదరి (తపనా చౌదరి) అన్నారు. బీజేపీ పల్లె నిద్రలో భాగంగా మండలంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన పార్టీ సిద్ధాంతాలు రెండు ఒకేవిధంగా ఉన్నాయని, రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధి కారంలోకి వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. నిర్వాసితు ల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా వెళతా మన్నారు. జనసేన మండల అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ పలు సమ స్యలపై వినతిపత్రన్ని అందజేశారు. మేచినేని సంజయ్, కొవ్వాల క్రాంతి కుమార్, సుధాకర్, పొట్ల మోహన్, కేచ్చేలా శ్రీను, భాను పాల్గొన్నారు.
కుక్కునూరు: తపన ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయ నున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అన్నారు. మండలం లో పల్లెకు పోదాం కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాలయంలో తపన ఫౌం డేషన్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఫౌండేషన్ ద్వారా మహిళల ఆర్థిక బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రానున్న రోజు ల్లో కుక్కునూరు మండలంలో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపడ తామన్నారు. మొడియం శ్రీనివాసరావు, వల్లాల రాధాకృష్ణ, తూము వెంకన్న, ఉపాధ్యక్షుడు దుద్దుకూరి కృష్ణార్జునరావు, వెలకం బాలకృష్ణ, సున్నం మహేష్, చింతా భాస్కర్, కునవరపు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. కైకరం, బాదంపూడి, నారాయణపురం గ్రామాలలో కార్యకర్తలు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వనచర్ల భాస్కరరావు, పరిమి సత్యనారా యణ, రుద్రరాజు శ్రీనివాసరాజు, అడపా శోభారాణి, కాకిలేటి వెంకటేశ్వర రావు, శానం రామాంజనేయులు, రజని తదితరులు పాల్గొన్నారు.
లింగపాలెం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్కిషోర్, ఆర్ ఎస్ఎస్ చక్రధర్రావు ఆధ్వర్యంలో మండలంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. బొండాడ నరేంద్రప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. కుర్రా సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, ఎస్.వి నాగేశ్వరరావు, సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Feb 12 , 2024 | 12:17 AM