వంద రోజుల పనిదినాల కల్పనే లక్ష్యం: పీడీ
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:47 PM
జిల్లాలోని అన్ని మండలాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో వేతనదా రులకువందరోజుల పనిదినాల కల్పనేలక్ష్యంగా విధులు నిర్వహించాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని డ్వామా కార్యా లయంలో ఏపీడీలు, అన్నిమండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసి స్టెంట్లతో ఉపాధిహామీ పథకం పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇప్పటికే 70 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీ లకు 100పనిదినాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1,16,108 మంది కి వందరోజుల పనిదినాల కల్పన లక్ష్యమని,ఆ లక్ష్యాన్ని చేరుకోకుంటే సిబ్బం దిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహిం చాలని, క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీల సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సగటువేతనం పెరగాల్సిన అవసరం ఉందని, సగటు పనిదినాలు కూడా ఎక్కువగా ఉండేలా దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిస్థాయిలో ఉపాధిని కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో రెండు పూటలా పనులు జరగాలన్నారు. స్థానిక జాబ్ కార్డుదారులకు ఉపాధి పనులను గుర్తించి,అంచనాలను ఈనెలనాలుగోతేదీలోగా జిల్లా కార్యాలయానికి పంపించాలని తెలిపారు. ఉపాధి పథకం అమలుకు సంబంధించిన స్పందన కార్యక్రమంలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యవేక్షణ అధికారి కేవీ అప్పలనాయుడు, ఏపీడీలు పి.రాధ, శైలజ, జి.హరిత, లోకేష్, మురళీకృష్ణ, 30 మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్: జిల్లాలోని అన్ని మండలాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో వేతనదా రులకువందరోజుల పనిదినాల కల్పనేలక్ష్యంగా విధులు నిర్వహించాలని డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని డ్వామా కార్యా లయంలో ఏపీడీలు, అన్నిమండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసి స్టెంట్లతో ఉపాధిహామీ పథకం పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇప్పటికే 70 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీ లకు 100పనిదినాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1,16,108 మంది కి వందరోజుల పనిదినాల కల్పన లక్ష్యమని,ఆ లక్ష్యాన్ని చేరుకోకుంటే సిబ్బం దిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహిం చాలని, క్షేత్రస్థాయిలో ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీల సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సగటువేతనం పెరగాల్సిన అవసరం ఉందని, సగటు పనిదినాలు కూడా ఎక్కువగా ఉండేలా దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పూర్తిస్థాయిలో ఉపాధిని కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో రెండు పూటలా పనులు జరగాలన్నారు. స్థానిక జాబ్ కార్డుదారులకు ఉపాధి పనులను గుర్తించి,అంచనాలను ఈనెలనాలుగోతేదీలోగా జిల్లా కార్యాలయానికి పంపించాలని తెలిపారు. ఉపాధి పథకం అమలుకు సంబంధించిన స్పందన కార్యక్రమంలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యవేక్షణ అధికారి కేవీ అప్పలనాయుడు, ఏపీడీలు పి.రాధ, శైలజ, జి.హరిత, లోకేష్, మురళీకృష్ణ, 30 మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 11:47 PM