సమస్యలు పరిష్కరించకపోతే మైనింగ్ను అడ్డుకుంటాం
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:03 PM
తమ సమస్యలను సత్వరమే పరిష్కరించకపోతే మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటామని డేంజర్ జోన్లోని కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ ప్రజ హెచ్చరించారు.
ఆర్.ఆర్-5 గ్రామస్తుల హెచ్చరిక
ఓబులవారిపల్లె, మార్చి 4: తమ సమస్యలను సత్వరమే పరిష్కరించకపోతే మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటామని డేంజర్ జోన్లోని కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ ప్రజ హెచ్చరించారు. పునరావాస గ్రామాల్లోని నిర్వా సితులకు పరిహారం, ఉపాధి కల్పన విషయం లో రోజురోజుకు అలస్యం జరుగుతోందని త మకు సత్వరమే న్యాయం చేయాలని మైనింగ్కు వెళ్లే వాహనాలను నిలిపివేసి గ్రామానికి సం బంధించిన పశువులను అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్యాకేజీ, ఇళ్లు , భూములకు పరిహారంు, సీఎం ఎస్.ఆర్.నివేదిక ప్రకారం అ ర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబరు 8లో ఉన్న పశువుల మేత బీడు, శ్మశాన వాటిక, కాటమ దేవుని గుడికి ప్రత్యామ్నాయ భూమిని చూపి, పరిహారం చెల్లించాలన్నారు. ఆర్.ఆర్-5 లేఅవుట్లకు పట్టాలు ఇవ్వాలని అలాగే మూడు గ్రామాల ప్రజలకు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పా టు చేయాలని, నిబంధనల ప్రకారం అర్హత ఉండి ప్యాకేజీ రాని వారికి న్యాయమైన పరిహా రం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య లను సత్వరమే పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని సీపీవో సుదర్శన్రెడ్డి తెలప డంతో నిరసన విరమించారు. సమస్యలు పరి ష్కరించకపోతే భారీ ఎత్తున జనసమీకరణ చేసి పూర్తిస్థాయి మైనింగ్ అడ్డుకుంటామని నినాదా లు చేశారు. ఈ కార్యక్రమంలో పులపత్తూరు రామసుబ్బా రెడ్డి, పులపత్తూరు సుదర్శన్రెడ్డి, దేవేంద్రారెడ్డి, సురేంద్రారెడ్డి, జై భరత్రెడ్డి, రమణారెడ్డి, సాయి ప్రశాంత్రెడ్డి, కోటి, హరి కృష్ణ, అలాగే మూడు గ్రామాల ప్రజలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
Updated Date - Mar 04 , 2024 | 11:03 PM