ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఒంటిపూట బడుల ప్రకటన వచ్చేసింది!

ABN, Publish Date - Mar 13 , 2024 | 03:48 AM

ఒంటిపూట బడులు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభిస్తుంటే, ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

అదే రోజు నుంచి టెన్త్‌ పరీక్షలు.. వెంకట్రామిరెడ్డి పేరుతో ప్రకటన

ఆయనకేం సంబంధమని టీచర్ల ప్రశ్న

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఒంటిపూట బడులు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభిస్తుంటే, ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రకటించలేదు. విచిత్రంగా ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పేరుతో ప్రకటన వెలువడింది. ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్‌ గ్రూపుల్లో ఆయన ఈ సమాచారాన్ని షేర్‌ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఒంటిపూట బడులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని, ప్రభుత్వ ప్రకటనలు ఆయన తెలియజేయడమేంటంటూ ఆక్షేపిస్తున్నారు. కాగా, 18 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - Mar 13 , 2024 | 07:07 AM

Advertising
Advertising