మట్టి, ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని ఆందోళన
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:17 AM
మట్టి, ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని ఆందోళన
పి.గన్నవరం, ఫిబ్రవరి 29: మానేపల్లి శివారు లంక భూముల్లో జరగుతున్న ఇసుక, మట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని మానేపల్లి శివారు శివాయిలంక గ్రామస్తులు డిమాండ్ చేశారు. గోదావరి నదీపాయ చెంతన 200కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తీరం వెంబడి మట్టి, ఇసుక తవ్వకాలతో మాగ్రామం ఉనికికే ప్రమాదం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై ఎన్నో సార్లు సంబందిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పటికి ఫలితం లేదన్నారు. తవ్వకాలు నిలుపుదల చేయకపోతే మాభూములు గోదారమ్మ ఒడిలో కలిసిపోతాయన్నారు. ఇప్పటికే వ్యవసాయ భూములు నదీకోతకు గురై ఈప్రాంతం చెరువులుగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుచ్చకాయల సాయిబాబు, ఒండ్రు భాస్కరావు, పుచ్చకాయల సత్యనారాయణ, ఏడుకొండలు, మానుకొండ ఏడుకొండలు, పోతుల రాజు పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:17 AM