Kurnool Dist.: చెన్నాపురంలో మొసలి కలకలం..
ABN, First Publish Date - 2023-05-09T12:09:37+05:30
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం, చెన్నాపురంలో మొసలి (Crocodile) కలకలం (Kalakalam) రేపింది.
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం, చెన్నాపురంలో మొసలి (Crocodile) కలకలం (Kalakalam) రేపింది. వెంకట్రాముడు అనే రైతు పొలంలో మొసలి ప్రత్యక్షం కావడంతో చుట్టుప్రక్కల రైతులు (Farmers) భయాందోళనకు గురయ్యారు. పొలంలో వరి పంట కోస్తుండగా మిషన్ కింద మొసలి ఇరుక్కోవడం చూసిన రైతులు.. వెంటనే మిషన్ ఆపి అటవీశాఖ అధికారులకు (Forest Department Officials) సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మొసలిని బయటకు తీసి పరిశీలించగా మొసలి రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయినట్లు గుర్తించి.. పశువుల డాక్టర్తో చికిత్స అందించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.
Updated Date - 2023-05-09T12:09:37+05:30 IST