తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహం..
ABN, First Publish Date - 2023-07-24T10:51:42+05:30
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోంది. బీసీల జపం అన్ని పార్టీలు చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోంది. బీసీల జపం అన్ని పార్టీలు చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అమలు చేసే విధానాన్నే తెలంగాణలో కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-24T10:51:42+05:30 IST