పత్తికొండలో అధికారుల ఓవరాక్షన్..
ABN, First Publish Date - 2023-06-01T12:05:09+05:30
కర్నూలు జిల్లా: సీఎం జగన్ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా, పత్తికొండలో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రతికొండ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు.
కర్నూలు జిల్లా: సీఎం జగన్ (CM Jagan) పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లా, పత్తికొండలో అధికారులు ఓవరాక్షన్ (Overaction) చేస్తున్నారు. ప్రతికొండ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) ప్రారంభోత్సవానికి సీఎం జగన్ (CM Jagan) వస్తుండడంతో పత్తికొండలో షాపులను అధికారులు మూసివేయించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను మూయించారు. షాపులు మూసివేయడంతో నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు. అంతే కాకుండా పత్తికొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అందులో భాగంగా వాహనాలను బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-01T12:05:09+05:30 IST