సరికొత్త రికార్డులకు నాందిపలికిన లోకేష్ పాదయాత్ర..
ABN, First Publish Date - 2023-07-11T11:44:28+05:30
నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడడమే లక్ష్యంగా తెలుగుదేశం యువకెరటం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వడివడిగా లక్ష్యం వైపు సాగుతోంది.
నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడడమే లక్ష్యంగా తెలుగుదేశం యువకెరటం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వడివడిగా లక్ష్యం వైపు సాగుతోంది. ప్రజల కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న యువతనేత లోకేష్ పాదయాత్ర సరికొత్త రికార్డులకు నాంది పలికింది. నిర్దేశిత లక్ష్యాలన్నింటికంటే ముందుగానే రెండువేల కి.మీ. మైలు రాయిని చేరుకుంది. రోజుకు సగటున 10. కి.మీ మేర నడవాలని లక్ష్యంగా నిర్ణయించిన లోకేష్.. 153 రోజుల్లో సగటున రోజుకు 13.5 కి.మీ. చొప్పున పాదయాత్ర చేసి 2వేల కి.మీ. మైలు రాయి చేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-11T11:44:28+05:30 IST