Nara Lokesh Padayatra: అడుగడుగునా ఆంక్షలు, షరతులు
ABN, First Publish Date - 2023-01-25T11:02:18+05:30
ఈనెల 27వ తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువనేత నారా లోకేశ్(TDP youth leader Nara Lokesh) పాదయాత్ర తలపెట్టారు. ‘యువగళం’ పేరుతో
అమరావతి: ఈనెల 27వ తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువనేత నారా లోకేశ్(TDP youth leader Nara Lokesh) పాదయాత్ర తలపెట్టారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు... 400 రోజులు 4000 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నదీ, లేనిదీ చెప్పకుండా పోలీసులు సోమవారం దాకా నాన్చారు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ఎన్.సుధాకర్ రెడ్డి ఈ యాత్రకు అనుమతి ఇచ్చారు. అదీ... అనేక షరతులతో! ‘గీత దాటితే అనుమతులు రద్దు చేస్తాం’ అని సూటిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ ఏకంగా 15 షరతులు విధించారు. అవి చూసి టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-01-25T11:02:20+05:30 IST