బాబును కలవనున్న లోకేష్, భువనేశ్వరి
ABN, First Publish Date - 2023-10-28T10:05:16+05:30
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు శనివారం ములాఖత్ కానున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి కలుస్తారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు శనివారం ములాఖత్ కానున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి కలుస్తారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు వారు కలవనున్నారు. ఈ మేరకు జైల్ అధికారులు కూడా సమాచారం అందించారు. అయితే ఇది చాలా కీలకమైన ములాఖత్ అని చెప్పాలి. చంద్రబాబును అరెస్టు చేసి దాదాపు 50 రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆయన బయటకు రాకపోవడం.. ఇదే కేసులో నిందితులు బెయిల్పై వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో జైల్లో ఆయన భద్రత, ఆరోగ్యంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-28T10:05:16+05:30 IST